అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!!

బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ , పచ్చిమట్ల రవీందర్ గౌడ్

అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ టెండర్లను రద్దు చేయాలి!!!

సిద్దిపేట  (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే డివైడర్ల మధ్య  అనధికార, అక్రమ అడ్వర్టైజ్మెంట్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని బిఎస్సి పార్టీ పక్షాలు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని బీఎస్పీ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా మున్సిపాలిటీ ప్రజలకు తెలియకుండా మున్సిపాలిటీలో నోటీసు బోర్డు పై టెండర్ ప్రక్రియ ప్రకటన తెలియజేయకుండా, ఎవరి ప్రయోజనం కొరకు ఇట్టి టెండర్ ఏకపక్షంగా ఎందుకు కేటాయించారని, పార్టీ పక్షాన అడగటం జరుగుతుందన్నారు.మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏ రకంగా సదరు వ్యక్తులకు టెండర్ ఇచ్చారో తెలియజేయాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ అక్రమ టెండర్ ను వెంటనే రద్దు చేయకపోతే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయమును ముట్టడిస్తామని హెచ్చరించారు.అదేవిధంగా బిల్డింగ్లపై ఏర్పరిచిన హోల్డింగ్ ప్రకటనల ఆదాయ వివరాలు కూడా తెలపాలని కోరారు.అందులో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున  ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ  నాయకులు మొగలిపాక శ్రీనివాస్, వేల్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News