బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ
నాగర్ కర్నూల్ : 18వ వార్డు శ్రీనగర్ కాలనీ, 3వ వార్డు దేశిటిక్యాలలోని బస్తీ దవాఖానాలను గురువారం పరిశీలించిన కలెక్టర్, బస్తిీ దవాఖానాల్లో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, నిర్వహణ తీరును పరిశీలించార్ు.రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యతపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నరూ. ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారు,ప్రజలు బస్తీ దవాఖానాల సేవలను ఎంతమేరకు వినియోగించుకుంటున్నారో ఆరా తీశారు.దవాఖానకు వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు, వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకొని వైద్య సిబ్బంది సమయానికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ప్రతి రోగికి సకాలంలో వైద్యం, అవసరమైన వైద్య పరీక్షలు, మందులు అందించాలని సూచనలు చేశారు.ప్రజలకు సమీపంలోనే మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందేలా చర్యలు చూడాలన్నారు. రోగుల ఆరోగ్య సమస్యలను ఓపికగా విని తగిన చికిత్స అందించాలని వైద్యసిబ్బందికి సూచన చేశారు.బస్తీ దవాఖానాల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. బస్తి దావకఖాన నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 16:21:51
సిద్దిపేట (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే డివైడర్ల మధ్య అనధికార, అక్రమ అడ్వర్టైజ్మెంట్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని...
