పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సీఎంఆర్ కాలనీలో మొక్కలు నాటిన ఉపసర్పంచ్ రఫీక్

మెదక్ : పర్యావరణ పరిరక్షణ, హరితహారం కార్యక్రమంలో భాగంగా చేగుంట సీఎంఆర్ కాలనీలోని శ్రీ హనుమంతుడి దేవాలయ ప్రాంగణంలో గ్రామ ఉపసర్పంచ్ *రఫీక్* గారు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గుడి ప్రాంగణంలో పువ్వుల చెట్లు మొక్కలు తదితర మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడిన ఉపసర్పంచ్ రఫీక్ గారు _"గుడి ప్రాంగణాలు పచ్చగా ఉంటే భక్తులకు ప్రశాంత లభిస్తుంది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీడ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది"_ అని అన్నారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలకు నీళ్లు పోశారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను ఆలయ కమిటీకి అప్పగించారు.భక్తులు కూడా ఈ చొరవను హర్షించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గుడి వద్ద జరగాలని కోరారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంక్షేమ పథకాలు:  ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
భూత్పూర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ
గ్రామపంచాయతీ సిబ్బంది రిలే నిరాహార దీక్ష
నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన చెంచు గిరిజనులందరికీ ఓటు హక్కు కల్పించాలి
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించండి
ప్రధాన మురికి కాలువ లో చెత్త వేస్తే జరిమానా.
పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు