గంభీరావుపేటలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
గంభీరావుపేట ,/ రాజన్న సిరిసిల్ల : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్థూపం వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో గురువారం నాడు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని చేసిన సేవలను కొనియాడారు. భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సేవలు చేశారని, అతని అడుగుజాడలలో నడవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాండ్ల బాల్ క్ష్మి, మల్యాల రాజ్వీర్, బంగ్లా రాజు గౌడ్, గోపగారి లక్ష్మీనారాయణ గౌడ్, గౌరీ శంకర్, టేకుమల్ల ప్రవీణ్, ఎడబోయిన ప్రభాకర్, దేశెట్టి రాజశేఖర్, శివంది శ్రీనివాస్, తాజుద్దీన్, నరేష్ వర్మ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Views: 17
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Aug 2026 16:21:51
సిద్దిపేట (హుస్నాబాద్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ హైవే డివైడర్ల మధ్య అనధికార, అక్రమ అడ్వర్టైజ్మెంట్ టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని...
