పులుకుర్తి లో 300 కిలోల గంజాయి స్వాధీనం
దామెర. హన్మకొండ. : హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో సుమారు 300 కిలోల గంజాయిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.నిందితుడు నాగేశ్వరరావు పై సుమారు మూడు రాష్ట్రాలలో గంజాయి కేసులు ఉన్నట్లు సమాచారం. భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ఒక ఎస్సై 2024 కు సంబంధించిన కేసులో విచారణలో భాగంగా పులుకుర్తి గ్రామంలో ఉన్న నాగేశ్వరరావు ఇంటిని సోదా చేయగా నాగేశ్వరరావు ఇంట్లో గంజాయి లభించగా స్థానిక దామెర పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితున్ని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. నాగేశ్వరరావు ఒరిస్సా నుండి గంజాయి తెప్పించి మహారాష్ట్ర మరియు హైదరాబాదుకు తరలిస్తాడని సమాచారం
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


