గ్రామీణ పాఠశాల స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించాలి.
మెదక్ మండల విద్యాధికారి శంకర్
మెదక్ ; గ్రామీణ స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించి జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో సత్తా చాటించాలని మెదక్ మండలం విద్యాధికారి, న్యూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శంకర్ అన్నారు.మంగళవారం మెదక్ లో నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ మీటింగ్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలలో కూడా విద్యార్థులు సత్త చాటలని ఆయన అన్నారు. క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా దృడoగా ఉంటారని ఆయన అన్నారు. ఎస్జిఎఫ్ సెక్రటరీ నాగరాజు, ఫిజికల్ డైరెక్టర్ మాధవరెడ్డి, మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి, క్రీడలు విద్యా రంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలోమధుసూదన్, డిఆర్పిలు రవి, దేవానంద్, మైపాల్, వెంకటకృష్ణ , వివిధ మండలాల నుండి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Views: 72
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Aug 2026 18:24:47
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
