అవయవదానంతో బాల్‌రాజ్‌ చిరస్మరణీయం

అవయవదానంతో బాల్‌రాజ్‌ చిరస్మరణీయం

దౌల్తాబాద్‌, సిద్దిపేట: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మూడు రోజులుగా సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన డీఆర్‌డీఏ కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ బాల్‌రాజ్‌ మృతదేహానికి సిద్దిపేట అడిషనల్‌ డీఆర్‌డీఓ సుధీర్‌ నివాళులర్పించారు. బాల్‌రాజ్‌ మరణానంతరం అవయవదానం చేసి పలువురి జీవితాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయన కుటుంబానికి శాఖ తరఫున అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో దౌల్తాబాద్‌ ఏపీఎం మహిపాల్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News