ఇస్నాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం
పుల్కల్కు చెందిన యువకుడు దుర్మరణం
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పుల్కల్ మండలానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం హాన్మ్యానాయక్ తండాకు చెందిన గోరం లక్ష్మణ్ కుమారుడు గోరం ప్రశాంత్ (32) ద్విచక్ర వాహనంపై పటాన్చెరు వైపు వెళ్తున్నాడు.ఈ క్రమంలో ఇస్నా పూర్ సమీపంలోకి రాగానే అతడు ప్రయాణిస్తున్న బైక్ను ఓ ప్రైవేట్ బస్సు బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ప్రశాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చేతికందిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో హాన్మ్యానాయక్ తండాలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు.
Views: 169
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 17:42:08
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...
