రేపు ఎస్ ఐ ఆర్ పై బీఎల్ఏల సమీక్షా సమావేశం.
-హాజరుకానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
-వెల్లడించిన కర్ణం కన్వీనర్ కరణం పురుషోత్తం రావు.
తాండూరు (వికారాబాద్ జిల్లా) టీపీసీసీ ఆదేశాల మేరకు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధ్యక్షతన మరియు డీసీసీ అధ్యక్షులు ధారసింగ్, సర్ ప్రక్రియ పరిశీలకులు జగదీశ్వర్ రావు, వినయ్ రెడ్డి గార్ల సమక్షంలో రేపు 25న మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటలకు శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అంతారం రోడ్ నందు ఎస్ ఐ ఆర్ ఫేస్ 2 ప్రక్రియలో భాగంగా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని 269 బూత్ల(పోలింగ్ స్టేషన్స్ )బీఎల్ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్ ఐ ఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్ర మానికి మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బీఎల్ఏలు, క్లస్టర్ ఇన్చార్జిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 17:42:08
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...
