బల్వంతాపూర్లో అంబేడ్కర్ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మల్యాల : జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని బల్వంతాపూర్ గ్రామంలో అంబేడ్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానికంగా నిర్వహించిన సమావేశంలో గ్రామ పెద్దలు, సంఘ సభ్యుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడు నక్క శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు తైదల వంశీ,ప్రధాన కార్యదర్శి ఉండేటి శ్రీకాంత్,క్యాషియర్ చిర్ర అనిల్,కార్యదర్శి గాలిపల్లి సుధీర్,బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ గ్రామ అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 40
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Aug 2026 18:24:47
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
