మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా తోట లక్ష్మీకాంతారావు బాధ్యతల స్వీకరణ
బిచ్కుంద, : తెలంగాణ శాసనసభలోమైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తోట లక్ష్మీకాంతారావుకి శుభాకాంక్షలు తెలిపారు.
Views: 95
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 16:02:22
మేడిపల్లి/భీమారం (జగిత్యాల) : కట్లకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనుమల్ల వైకుంఠం ఆధ్వర్యంలో రహదారి నిబంధనలు, భద్రతపై విద్యార్థులకు...
