గురువులకు విద్యార్థుల ఘన సన్మానం
యాదగిరిగుట్ట: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాదువెల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు.కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు కడెం సోమయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.కార్యక్రమంలో సహాయ ఉపాధ్యాయుడు ఎస్.ఉదయ్కుమార్,విద్యా వాలంటీర్లు కె.బాలకృష్ణ, ఇ.వెన్నెల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


