కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణ వార్డ్ నెంబర్ 7లో కొరివి కృష్ణ స్వామి జయంతిని ముదిరాజ్ భవనంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముదిరాజ్ బంధుమిత్రులు తాలూకా పట్టణ అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ తొలి మేయర్ అయినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజీవి కొరివి కృష్ణ స్వామి జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాలూకా ముదిరాజ్ అధ్యక్షులు శంకర్ గారు మాట్లాడుతూ కృష్ణ స్వామి గారు తన జీవితంలో ముదిరాజుల యొక్క ఔన్నత్యానికి, ఆర్థిక, సామాజిక, అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా పత్రిక సంపాదకుడు గా పని చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ అధ్యక్షులు రమేష్ గారు, పట్లోల గోపాల్, హోతి కే అధ్యక్షులు బోయిని అడివన్న, పట్టణ కార్యదర్శి మహేష్ ముదిరాజ్, పట్టణ ముదిరాజ్ పత్రికా సలహాదారుడు బోల్గరి శేఖర్,ఆకాష్,విశ్వనాధ్ టౌన్ ఉపాధ్యక్షలు, ఎక్కాలి శ్రీను, కృష్ణ,శ్రీకాంతి, పాండు రాజ్గిరి, కే గోపాల్,మ్ మల్లేష్,ఇటకెపల్లి మల్లేష్, మహిపాల్ ఖానాపూర్, దీపక్ ముదిరాజ్, కే కృష్ణ,బోయిని మల్లేష్, బోయిని వినోద్, సుభాష్, నవీన్, మేకలి నవీన్, హైద్రాబాద్ సాయి ముదిరాజ్,అర్జున్ ముదిరాజ్,గడి ముదిరాజ్ అధ్యక్షులునర్సిములు, పస్తాపూర్ ముదిరాజ్ అధ్యక్షులు తుకారాం , ఖానాపురం మల్లేష్, శాంతినగర్ ముదిరాజ్ అధ్యక్షులు ప్రవీణ్, కోహిర్ ముదిరాజ్ కార్యదర్శి షికారీ శ్రీను, శంకర్ ఆర్టీసీ, లింగమయ్య, విట్టల్ హుగేల్లి, అశోక్,నరేష్ గడి, జనార్దన్ అడ్వా్కేట్, బోల్గర్ మొగులయ్య, హరీష్, అశోక్ ముదిరాజ్, రాజు రంజోల్, వెంకట్, సాయిప్రకాష్,తదిరులు ఇందులో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


