తాపీ కార్మికుల సంక్షేమమే లక్ష్యం..
సంకరీ కృష్ణ, ఎలగం శ్రీనివాస్ను గెలిపించండి : ఆవుల కొమురయ్య
బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి తాపీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే సంకరీ కృష్ణ, ఎలగం శ్రీనివాస్ను సంఘం ఎన్నికల్లో గెలిపించాలని తాపీ కార్మిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఆవుల కొమురయ్య కోరారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంకరీ కృష్ణకు పడవ గుర్తుపై, ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న ఎలగం శ్రీనివాస్కు కొబ్బరికాయ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.కార్మికుల సమస్యల పరిష్కారానికి, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నెల 6న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల అనంతరం అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


