షాద్‌నగర్‌ బస్టాండ్‌ ఆదాయంలో టాప్‌.. వసతుల్లో ఫ్లాప్‌!

షాద్‌నగర్‌ బస్టాండ్‌ ఆదాయంలో టాప్‌.. వసతుల్లో ఫ్లాప్‌!

  • వాణిజ్య అద్దె రూపంలో 10 లక్షల ఆదాయం..
  • ప్రయాణికులకు మాత్రం మొండిచేయి
  • కుర్చీలు లేవు.. మంచినీళ్లు లేవు.. పారిశుద్ధ్యం అంతంతే

షాద్‌నగర్‌ : పట్టణంలోని బస్టాండ్‌ ఆదాయం రోజురోజుకూ పెరుగుతోంది.కానీ ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం పడకేశాయి. బస్టాండ్‌ సముదాయం లోని దుకాణాలు, వాణిజ్య స్థలాల అద్దెల రూపంలో నెలకు సుమారు రూ.10 లక్షల ఆదాయం సమకూరుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వేరు. ఇంత భారీగా రాబడి ఉన్నా.. కనీస వసతుల కోసం ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ విస్తరణతో బస్టాండ్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు నిత్యం వేలాదిగా రాకపోకలు సాగిస్తున్నారు. కానీ వారికి అందాల్సిన కనీస సదుపాయాలు కరువయ్యాయి. వెయిటింగ్‌ హాల్‌లో కుర్చీల కొరత.. వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చోవాల్సిన దుస్థితి,తాగునీటి వసతి అంతంతమాత్రం..ఎండాకాలంలో మరింత ఇబ్బంది,పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. చెత్తాచెదారం, మరుగుదొడ్ల నిర్వహణ లోపం తీవ్రత ఉందన్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం ఎంత? నిర్వహణ, మరమ్మతులు, పారిశుద్ధ్యానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న వివరాలు అధికారులు బహిర్గతం చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా ఆదాయానికి తగ్గట్టు వసతులు కల్పించాలి. కేవలం రాబడి కేంద్రంగా కాకుండా, సేవా కేంద్రంగా బస్టాండ్‌ను తీర్చిదిద్దాలని కోరుతున్నారు. 

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో