సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం.. బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు

ఎల్లారెడ్డిపేట, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ తెలిపారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎన్. రమేష్ మాట్లాడుతూ.. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలరోజుల పాటు పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.అదేవిధంగా పోలీసుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల సూచనలు, నిబంధనలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై ఎన్. రమేష్ కోరారు. ఎల్లారెడ్డిపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి మిడ్జిల్ పీహెచ్‌సీలో సమస్యలు పరిష్కరించాలి: పల్లె తిరుపతి
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్,
మహాలక్ష్మి ఆలయంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా  ఉమామహేశ్వరి
కొరివి కృష్ణస్వామి జయంతి వేడుక
ముఖ్యమంత్రీ.. చెత్త పనులు మానుకో