విగ్రహ భూమి పూజ చేస్తున్న ముదిరాజ్ సంఘ సభ్యులు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగల సాయన్న
గండీడ్, :బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగల సాయన్న గండీడ్ మండలం ముదిరాజ్ సంఘ అధ్యక్షులు భోయిని గోపాల్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో పండగ సాయన్న విగ్రహ ఆవిష్కరణకు ముదిరాజ్ సంఘం సభ్యులు భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగల సాయన్న భూస్వాముల దగ్గర తీసుకొని నిరుపేదల కడుపు నింపిన మహనీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రథమ పౌరురాలు గొల్ల సత్యమ్మ, మండల ప్రధాన కార్యదర్శి కేశవులు, పెద్దలు గిరమోని అంజయ్య, బంటు నరస ప్ప, రామచంద్రయ్య వెంకటయ్య, గోపాల్ ఆయా గ్రామాల ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Sep 2026 19:01:12
మిడ్జిల్: మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, మందుల కొరత, పారిశుధ్య సమస్యలపై మాజీ ఉప సర్పంచ్ పల్లె తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల...
