విజయవాడ బస్సులకు ఎల్బీ నగర్లో బోర్డింగ్ సౌకర్యం
పటాన్చెరు, టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేలా విజయవాడతో పాటు ఆ మార్గంలో ముందున్న ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఎక్కే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 1665 వద్ద ప్రయాణికులు బస్సులను ఎక్కవచ్చు. ఇప్పటివరకు విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎక్కేందుకు నగరంలోని ప్రధాన బస్స్టేషన్లకు వెళ్లాల్సి రావడంతో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బోర్డింగ్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో మెట్రో ద్వారా అక్కడికి చేరుకుని నేరుగా బస్సు ఎక్కే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఇస్నాపూర్, పటాన్చెరు ప్రాంతాల నుంచి విజయవాడ వైపు ప్రయాణించే వారికి ఈ సౌకర్యం ఉపయోగకరంగా మారనుంది. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ను తప్పించుకుని మెట్రో మార్గంలో ఎల్బీ నగర్ చేరుకోవడంతో ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది.ఈ సౌకర్యాన్ని విజయవాడ, పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


