22ఏ నిషేధిత జాబితా నుండి పట్టా భూములను తొలగించాలి. బిజెపి
నస్పూర్(మంచిర్యాల) కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకవచ్చిన 22ఏ నిషేధిత భూముల జాబితా నుండి పట్టా ఉన్న నివాస మరియు వ్యవసాయ భూములు జాబితా తొలగించాలని కోరుతూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బిజెపి నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న బాధితుల నుండి స్వీకరించిన దరఖాస్తులను కలెక్టర్ కు రఘునాథ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబితాలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


