వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
ఎల్బీనగర్,: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ చౌరస్తా గాంధీ సెంటర్ లో నాగోల్ రజక సంఘం ఆధ్వర్యంలో బొడ్డుపల్లి మహేందర్ నాథ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు చిరంజీవిగౌడ్, మాల్ మైసమ్మ టెంపుల్ కమిటీ డైరెక్టర్ చెరుకు భవానిగౌడ్, నాగోల్ రామాలయ కమిటీ డైరెక్టర్ అనంతుల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజక అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర కమిటీ బొడ్డుపల్లి చుక్కయ్య, బీసీ మేడ్చల్ జిల్లా నాయకులు బిక్షపతి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులుటిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డుపల్లి హరిబాబు తదితర ప్రముఖులు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాగోల్ అధ్యక్షులు బొడ్డుపల్లి మధు, బొడ్డుపల్లి సహదేవ్, బొడ్డుపల్లి సురేష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బొడ్డుపల్లి తిలక్, బి ప్రవీణ్ కుమార్, బి సంజీవ్ కుమార్, బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


