రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం..!
- ఒకపక్క కల్వర్టు మరమ్మతులు.. మరో దిక్కు తేర్చుకున్న నీటి సంపు.
- ఆదమరిస్తే.. అంతే సంగతి, ఫిర్యాదు చేసి 15 రోజులైనా.. స్పందించని మున్సిపల్ అధికారులు
తాండూరు( వికారాబాద్ జిల్లా) తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా నుండి చంగేస్పూర్ వెళ్లే రోడ్డు లొ ప్రధాన రోడ్డు పక్కనే ఓ నివాసం ముందు యజమాని నీటి సంపు ఇనుప చువ్వలు తేలడంతో ప్రమాదంగా మారిందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఒకపక్క కల్వర్టు మరమ్మతులు మరో పక్క నీటి సంపు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ప్రజలు ఎప్పుడు ఏమి ప్రమాదం చోటు చేసుకుంటుదోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మాత్రం ఆదమరచిన ప్రమాదం జరగడం ఖాయమని స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గత 15 రోజుల క్రితమే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఓ మాజీ కౌన్సిలర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రోడ్డు పక్కనే నీటి సంపు ఏర్పాటుచేసిన యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


