అంబులెన్స్‌లో  ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

అంబులెన్స్‌లో  ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

గంభీరావుపేట మండలంలో  ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా ప్రసవం  చేశారు. శుక్రవారం గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాందేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే నొప్పులు తీవ్రమవ్వడంతో  పరిస్థితిని గమనించిన  ఈఎంటి చెలిమెల సాయికృష్ణ,  పైలట్ నాగరాజు  సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్సు వాహనంలోనే ప్రసవం చేశారు. రాందేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, అనంతరం వారిని మెరుగైన చికిత్స నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు ఆపత్కాలంలో సమయానికి స్పందించి పురుడు పోసిన 108 సిబ్బందిని  కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు  అభినందించారు.

Views: 45

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు