అంత్యక్రియలకు వీవీఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
జిన్నారం,: బొల్లారం డివిజన్ పరిధిలోని మోడల్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈశ్వరమ్మ (80) వయోభారంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వి. చంద్రారెడ్డి సూచన మేరకు శేఖర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వీవీఆర్ ఫౌండేషన్ తరఫున ఈశ్వరమ్మ అంత్యక్రియల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన వి. చంద్రారెడ్డి, శేఖర్లకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు కళావతి, పుణ్యవతి, వరలక్ష్మి, శ్రీనివాస్ రావు, గున్నారావు, నాగరాజు, రామారావు, గురుమూర్తి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


