ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిరంజీల వితరణ
-15 బాక్సులు సిరంజీలను వితరణ చేసిన మండల కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు
కారేపల్లి(ఖమ్మం) మండల కేంద్రమైన కారేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యుడు సురేష్ పిలుపుమేరకు మండల మెడికల్ షాఫ్ ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరంజీ బాక్సులను వితరణ చేశారు.గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి రంగనాథ్,ఉపాధ్యక్షులు అనంతారపు వెంకటాచారి,గౌరవ సలహాదారులు సూర్యదేవర వెంకటేశ్వరరావు,సభ్యులు డాక్టర్ పోలగాని శ్రీనివాసరావు,వెంకట్ తోపాటు మండలంలోని మెడికల్ షాపుల యజమానుల సమక్షంలో మండల వైద్యాధికారి గుగులోత్ సురేష్ కు 15 బాక్సుల సిరంజీలను అందజేశారు.ఆరోగ్య కేంద్రంలో నిత్యం రోగులకు వాడేందుకు సిరంజీలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వైద్యాధికారి సూచన మేరకు ఈ సిరంజీల బాక్సులను అందజేయడం జరిగింది. అడగ్గానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సిరంజిల బాక్స్ లను అందజేసిన కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులకు వైద్యాధికారి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


