ములుగులో రైస్ మిల్లర్ల ధర్నా , 13 ప్రధాన డిమాండ్లు
ములుగు : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని డీ ఎల్ ఆర్ నుండి ర్యాలీ గా బయలుదేరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి , అనంతరం గాంధీ విగ్రహానికి మాల వేసి పోస్ట్ ఆఫీసు వద్ద గల ధర్నా చౌక్ కు చేరుకొని ధర్నా చేశారు. రైస్ మిల్లర్ల భద్రత - రైతుల భవిష్యత్తు నినాదంతో ఈ ధర్నా జరిగింది. చిన్న మిల్లు, పెద్ద మిల్లు, మధ్య మిల్లు అనే తేడా లేకుండా అందరూ కలిసి సభ్యులైతేనే మన కష్టం, నష్టం, మన సమస్యలు, మన భవిష్యత్తు ఇండస్ట్రీని కాపాడుకునే విధానంలో ఉంటుందని మిల్లర్ల సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
ప్రధాన డిమాండ్లు:- మిల్లింగ్ చార్జీని రూ.150 కు పెంచాలి.
- బ్యాగ్ ధర రూ.11 గా నిర్ణయించాలి.
- రాబాక్సిన సివిల్ సప్లైస్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్, కస్టడియన్ చార్జీలను వెంటనే చెల్లించాలి.
- రుణాలపై వడ్డీ మరియు 12 శాతం వడ్డీని మాఫీ చేయాలి.
- 2022-23 రబీ టెండర్ ధాన్యం ధరను సవరించాలి.
- రైస్ మిల్లులను పరిశ్రమగా గుర్తించి 200 హెచ్ పి వరకు ఎల్ టి విద్యుత్ సరఫరా చేయాలి.
- ఖరీఫ్ ధాన్యాన్ని పూర్తిగా రా రైస్ గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్ గా స్వీకరించాలి.
- ఎఫ్ సి ఐ నిబంధనలు సడలించాలి. ఈ ధర్నాకు జిల్లాలోని మిల్లర్ల సంఘం అధ్యక్షులు బాదం ప్రవీణ్ తో కార్యదర్శులు, కోశాధికారులు , జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


