మట్టి గణపతులను పూజిద్దాం..
పర్యావరణాన్ని కాపాడుదాం: జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు.
నిర్మల్ : మట్టి గణపతులు పూజించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్ లో గురువారం అధికారులకు, సిబ్బందికి అదనపు కలెక్టర్ ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మంచి మార్పు మన నుంచే ప్రారంభం కావాలని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, కృత్రిమ రంగుల వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని, ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలనే పూజించాలని అన్నారు. పండుగలన్ని సాంప్రదాయ పద్ధతుల్లో పర్యావరణ హితంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

