విద్యార్థుల ఆలోచనలు సమాజానికి పరిష్కార మార్గాలు కావాలి..
జె.పి.ఎన్.సి.ఈ చైర్మన్ కె. ఎస్.రవికుమార్.
మహబూబ్ నగర్ రూరల్ : అనిల్ కుమార్: మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలోని ధర్మపూర్ లో గల జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 10, 2026న నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు ఉన్నత విద్యా సంస్థలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ఏఐసీటీఈ సౌత్ సెంట్రల్ రీజియన్కు చెందిన మేనేజర్ ఐ పి ఆర్ & టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డా. భీమా లింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం అందించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు ఉన్నత విద్యా సంస్థలకు అందుబాటులో ఉన్న వివిధ ఏఐసీటీఈ పథకాలు, కార్యక్రమాలు మరియు అవకాశాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పరిశోధన, ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి తదితర రంగాల్లో ఏఐసిటి ఈ అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు.ఈ సందర్భంగా జె పి ఎం సి ఈ చైర్మన్ కె. ఎస్. రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆవిష్కరణలు, పరిశోధన, పారిశ్రామికవేత్తల అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకుని, తమ ఆలోచనలను సమాజానికి మరియు పరిశ్రమలకు ఉపయోగపడే ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డా. పి. రవీందర్ కుమార్, వివిధ విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


