రూ.19 లక్షలతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన

రూ.19 లక్షలతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు శంకుస్థాపన

పటాన్‌చెరు,: 11శ్రీనగర్ కాలనీలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  నిధుల నుంచి రూ.19 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన ఈ పనులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కాలనీలో వర్షపు నీటి పారుదల సమస్యకు పరిష్కారం చూపే లక్ష్యంతో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైన్ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వలు, రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర బిక్షపతి, శ్రీధర్ చారి, టప్ప కుమార్, రాజిరెడ్డి, శాంతినగర్–శ్రీనగర్ అధ్యక్షులు అంజిరెడ్డి, ఏ. వెంకట్ రెడ్డి, టైలర్ విజయ్, రవీంద్ర చారి, కార్ రాజు, డీఈ కృష్ణవేణి, ఈఈ సురేష్ కుమార్, ఏఈ లావణ్య, కాంట్రాక్టర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు