ముస్లింల సమస్యలపై కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం: ఎంఐఎం
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల ఖాదీమ్ కబ్రస్తాన్లో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి తీవ్ర అపరిశుభ్రత నెలకొన్నా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంఐఎం మంచిర్యాల జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇబ్ని అఫాన్ మండిపడ్డారు.ఆగస్టు 29న కమిషనర్ను కలిసి సమస్యను వివరించగా, సెప్టెంబర్ 3న శుభ్రత పనులు చేపడతామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముస్లిం ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని, పవిత్రమైన కబ్రస్తాన్ ను వెంటనే శుభ్రపరిచాలvని డిమాండ్ చేశారు.అధికారులు తక్షణమే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టి సమస్యను పరిష్కరించకపోతే, ప్రజల తరఫున ఎంఐఎం మరింత బలంగా పోరాడుతుందని సయ్యద్ ఇబ్ని అఫాన్ హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


