రేషన్ డీలర్లకు ముఖ్య సమాచారం
- మిగిలిన దొడ్డు బియ్యం సేకరణపై రేపు సమావేశం
జిల్లా DCSO కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ
పటాన్చెరు, మిగిలిన దొడ్డు బియ్యం సేకరణకు సంబంధించి జిల్లాలోని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 8, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా DCSO కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన దొడ్డు బియ్యం సేకరణకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని రేషన్ డీలర్లందరూ తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని నాయికోటి రాజు కోరారు. ప్రతి ఒక్కరూ సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Views: 110
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Sep 2026 15:04:37
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ పిలుపు...
