ఎర్రకుంట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్ కృష్ణ నాయక్
నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం ఎర్రకుంట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారి సమక్షంలో సర్పంచ్ కృష్ణ నాయక్ లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డు వల్ల నిజమైన లబ్ధిదారులకు పథకాలు సమర్థవంతంగా అందుతాయని, దేశంలో ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలు అమలు చేస్తున్నారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవింద్ నాయక్, డిప్యూటీ సర్పంచ్ విజయ్ కుమార్ నాయక్, చత్రు నాయక్, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


