భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ :  జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కార ప్రగతిని పరిశీలించారు.ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా పెండింగ్ కేసులన్నింటినీ క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.ఏదైనా సాంకేతిక లేదా ఇతర కారణాలతో దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే, తిరస్కరణకు గల స్పష్టమైన కారణాలను రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే 22ఏ (22A) నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి, నిబంధనల మేరకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుదారులకు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం సేవలు అందించడంతో పాటు భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన