సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
శివంపేట( మెదక్) : మెదక్ జిల్లా శివంపేట మండలం ఆల్లీపూర్ తండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయ నిర్మాణానికి యతిన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ రవి మేఘావత్ రూ.25,000 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, తండా గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేఘావత్ సుధాకర్, సబావత్ బుచ్చియా నాయక్, సబావత్ మోహన్, హీరాలాల్, లోక్య, విజయ్, శేషు తదితరులు పాల్గొన్నారు.
దేవాలయ నిర్మాణానికి ఉదారంగా సహకరించిన శ్రీ రవి మేఘావత్ గారికి ఆలయ నిర్మాణ కమిటీ మరియు అల్లీపూర్ తండా గ్రామస్తుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


