బి.సి. మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం

బి.సి. మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం

మహబూబ్ నగర్ : బి.సి.మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విష్ణు నందన్ తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు కుట్టు మిషన్లు అందించి, ఇంటి వద్దనే కుట్టుపని చేసుకుంటూ స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు. పథకానికి అర్హత కలిగిన బీసీ మహిళల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 13 వరకు కొనసాగుతుందని, అర్హులైన బీసీ మహిళలు నిర్దేశిత గడువులోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు సమయంలో అవసరమైన వివరాలను సక్రమంగా నమోదు చేసి, నిర్దేశిత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన బీసీ మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని విష్ణు నందన్ కోరారు. పథకానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన