భవాని మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి.
--బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి.
తాండూరు (వికారాబాద్ ) భవాని మాత ఆశీస్సులతో తాండూర్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి అన్నారు. చంగిస్పూర్హ నుమాన్ టెంపుల్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్ల ప్రత్యేక ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ విఠల్ రెడ్డి పంజుగుల, తాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల చేన్గేష్పూర్ గ్రామంలో బోనమ్మ భవాని మాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, పెట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాస్ చారి, రాజప్ప గౌడ్, రాజు పటేల్, వెంకట్ రెడ్డి, అనంతయ్య గౌడ్, వెంకటయ్య గౌడ్, పాండు రంగారెడ్డి, భీమ్ రెడ్డి, చెంగోల్ రాకేష్ గౌడ్, సర్పంచ్ ప్రవీణ్ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
