యాదగిరిగుట్ట మండలంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
యాదగిరిగుట్ట: మండలవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి ప్రేమానురాగాలను చాటుకున్నారు. సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి, హారతులు ఇచ్చి రాఖీలు కట్టారు. అనంతరం మిఠాయిలు తినిపించి వారి క్షేమాన్ని ఆకాంక్షించారు.అన్నదమ్ములు సైతం అక్కాచెల్లెళ్లకు కానుకలు అందజేసి ఆప్యాయతను చాటుకున్నారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో రాఖీ పండుగ సందడి నెలకొంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ను కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Aug 2026 18:18:15
మంచిర్యాల టౌన్ రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కు చెందిన ఆడబిడ్డలు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
