ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కేంద్రంలో ఆర్డీవోతో ఆదేశాల మేరకు సంబంధిత బూత్ లెవల్ అధికారులకు బీఎల్వోలు,ఎస్ఐఆర్ నోటీసులను పంపిణీ చేశారు. ఈ నోటీసులను ఓటర్లకు సక్రమంగా అందజేయడంతో పాటు, వాటి వివరాలను యాప్లో ఎలా నమోదు చేయాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.పుల్కల్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆర్డీవోతో పాటు ఆందోల్-జోగిపేట, పుల్కల్ తహసీల్దార్లు, ఎంపీవో, డీటీ, జీపీవో, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్వోలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని, సమాచారాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా యాప్లో అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సూచించారు.శిక్షణ అనంతరం ఆర్డీవో పుల్కల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను, రోజువారీ పనితీరును పరిశీలించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Views: 38
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
