వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్బంగా అవార్డుల ప్రధానం

శంకర్ పల్లి : శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్ నరేష్ కుమార్ (సతీష్ కుమార్ ) కు బుధవారం నాడు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కింగ్ కోటి సరస్వతి భవనంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డును హ్యూమన్ రైట్స్ నేషనల్ చీఫ్ సెక్రటరీ డా. మోహన్ రావు పేర్కొన్నారు. నరేష్ కుమార్ చేసిన సమాజసేవ కార్యక్రమాలు, పురాతన మరకత శివాలయం ఆలయా అభివృద్ధి, ఆర్మీ సేవలను గుర్తించి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చిన్ననాటి నుండి దేశం పట్ల పకృతి పట్ల ఆర్మీ సేవల పట్ల హిందూ ధర్మం పట్ల స్వామి వివేకానంద ఆశయాల పట్ల మోటివేషన్ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. నరేష్ కుమార్ చేస్తున్న సేవలను నేటితరం యువకులు ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ వేనేంద్ర చారి, హైకోర్టు లాయర్లు నార్కో శాఖ ఎస్పీ మరియు డీసీపీ శ్రీనివాస్, డాక్టర్స్ విజయ్ పటేల్,రాష్ట్రస్థాయి సంస్థల ప్రముఖులు, జిల్లా ఇంచార్జి జగన్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


