మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసిన పాపన్నపేట బీజేపీ నాయకులు
మెదక్,మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ నివాసంలో శుక్రవారం రోజు పాపన్నపేట మండల అధ్యక్షులు సంతోష్ చారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బిజెపి పాపన్నపేట మోర్చాల అధ్యక్షులు,మండల ముఖ్య నాయకులు కలిసి ఏడుపాయల వన దుర్గామాత జ్ఞాపిక అందజేసినట్లు ఆయన తెలిపారు.ఈసందర్భంగా సంతోష్ చారి మాట్లాడుతూ పాపన్నపేట మండలంలోని పలు సమస్యలు ఎంపి దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారన్నారు. ఎంపీ నూతన మండల కమిటీ,మోర్చాల అధ్యక్షులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్,ధార్మిక సెల్ సెక్రెటరీ సంతోష్ గౌడ్,ప్రధాన కార్యదర్శులు లక్ష్మణరావు, నాగభూషణం,మండల ఉపాధ్యక్షులు బొక్కల భాగేష్,ఓబీసీ మోర్చా అధ్యక్షులు వడ్లభాగేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు జిన్నగోపాల్, యువమోర్చా అధ్యక్షులు జగదీష్,మహిళా మోర్చా అధ్యక్షులు మన్నె సుమలత,ఎస్సీ మోర్చా అధ్యక్షులు బాబు,ఎస్టి మోర్చా అధ్యక్షులు వెంకట్ నాయక్,బీజేవైఎం శ్రవణ్,బూత్ అధ్యక్షులు సాయిలు,మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నాయి కోటి మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
