ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన
నాంపల్లి మండలం నేరళ్లపల్లి గ్రామంలో ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి అనూష రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున బోర్ల కింద వరి సాగు చేసే రైతులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని మిగిలిన పొలంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పత్తి మరియు మిరప పంటలను సందర్శించి ఎరువుల యాజమాన్యం, పిచికారి మందుల గురించి రైతులకుఅవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ,నేరెళ్లపల్లి సర్పంచ్ సాగర్ల యాదయ్య, ఉపసర్పంచ్ దాసరి వెంకన్న, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Views: 38
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
