హిందూ పండుగల వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపు దారుణం
బీజేపీ నేత నాయిని సందీప్ కుమార్ ఆగ్రహం
గజ్వేల్/సిద్దిపేట : రాఖీ పండుగ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా తెలంగాణ ఆర్టీసీ అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించకపోవడంపై గజ్వేల్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పండుగలు వచ్చిన ప్రతిసారీ ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల భారం మోపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు గా మారిందని ఆయన మండిపడ్డారు. సాధారణ రోజుల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుండి హైదరాబాద్ (జేబీఎస్)కి బస్సు ఛార్జీ రూ. 90 ఉండగా, పండుగ స్పెషల్ పేరిట ఒక్కో టికెట్పై ఏకంగా రూ. 140 వసూలు చేస్తున్నారు. పండుగ లు ముగిసినా అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రద్దీని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేస్తోందని విమర్శించారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే ఉపసంహరించి, యథావిధిగా సాధారణ ఛార్జీలనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


