ముత్తారంలో ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు
ముత్తారం,: మండల స్థాయి ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) క్రీడా పోటీలు సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ముత్తారం మండలం దరియాపూర్ మోడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు ఎంఈఓ హరి ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 1న బాలికలకు కబడ్డీ, ఖోఖో,వాలీబాల్,2న బాలురకు ఆయా పోటీలు నిర్వహించనున్నారు. 3న బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచినక్రీడాకారులను సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు మంథనిలో జరిగే జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. క్రీడాకారులు ఫొటోతో కూడిన ఎస్జీఎఫ్ ఎలిజిబిలిటీ ఫారం, ఆధార్ కార్డుతో పోటీలు జరిగే వేదికకు హాజరు కావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు కే.వెంకటేష్ (9989844458), డి.రజిత (9603305700)ను సంప్రదించాలని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


