కాంగ్రెస్ మోసాలను గ్రామగ్రామాన ఎండగట్టాలి
పోరుబాట సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపు
పెద్దపల్లి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న ‘పోరుబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన పోరుబాట సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు మాటలకే పరిమిత మయ్యా యని, చేతల్లో అమలు కనిపించడం లేదని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ గ్రామాన పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సమావేశానికి పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని మనోహర్రెడ్డి కోరారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


