పేదల సంక్షేమమే..
- గ్రామాల అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం
- నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
- ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఎమ్మెల్యే
వరంగల్ (నల్లబెల్లి ): నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మాసంపెళ్లి వనజ – అఖిల్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికిముఖ్య అతిథిగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేద కుటుం బానికి సొంత ఇల్లు కల్పించడమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులై న ప్రతి నిరుపేద కుటుంబం గృహ కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


