ఇందిరమ్మ ఇల్లు.. పేద కుటుంబానికి సొంతింటి భరోసా
ముత్తారం, : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన లింగంవార్ మంజుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొట్టె అన్నపూర్ణ ఉపేందర్ హాజరై మంజుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతోఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం,ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వీరగోని అజయ్,లక్కం లక్ష్మి ప్రభాకర్, ముత్తారం స్వర్ణకారుల మండల అధ్యక్షుడు అకోజు అశోక్చారి,యువ నాయకుడు మెట్టు రాకేష్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


