ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి,

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి,

ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి,
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్,

నాగర్ కర్నూల్ :ప్రజావాణి,  ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, వినతులను అధికారులు సత్వరం పరిష్కరించి, ఆ వివరాలను సంబంధిత ఫిర్యాదుదారులకు తప్పనిసరిగాతెలియజేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూల్ సమీకృతజిల్లాకార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.చెన్నయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ప్రజల నుంచి అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు పరిష్కరించిన అనంతరం ఆసమాచారాన్నిసంబంధిత ఫిర్యాదుదారునికి తెలియజేయడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలోకి రాని పక్షంలో, దరఖాస్తును సంబంధిత శాఖకు లేఖ ద్వారా పంపించి, ఆ విషయాన్ని ఫిర్యాదుదారు నికి తెలియజేయాలని సూచించారు. ఏదైనా సమస్యను నిబంధనల ప్రకారం పరిష్కరించడం సాధ్యం కాకపోతే, ఆ విషయాన్ని స్పష్టంగా ఫిర్యాదుదారునికి తెలియజేయాలని, అవసరమైతేఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అంతేతప్ప దరఖాస్తులను తమ వద్ద పెండింగ్‌లో ఉంచకూడదని స్పష్టం చేశారు.ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి కార్యాలయం, నుంచి వచ్చిన ప్రజావాణి దరఖాస్తులకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 36 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని 20 మండలాల పరిధిలో తొలిరోజు నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాల్లో మొత్తం 103 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్నిసమర్ధవంతంగా నిర్వర్తించేలా క్షేత్రస్థాయిలోఅధికారులుప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాలసూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన పోసానిపల్లిలో 'జలసిరి' పనుల పరిశీలన
  చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం రాష్ట్రస్థాయి 'జలసిరి' పనుల ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా
రేషన్‌ డీలర్‌ను ప్రశ్నిస్తే ఇద్దరికే వస్తుందని సమాధానం
మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బాలరాజ్ 
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి ఘన నివాళులు
టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపిస్తున్న అక్రమ కట్టడాలు.
సన్న రకం సాగు చేసిన రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.
డంపింగ్ యార్డ్ తో కరీంనగర్ ప్రజల ఆరోగ్యానికి ముప్పు