నేడు వాసవి మాతకు చీరల అలంకరణ
ఖమ్మం : మూడవ శుక్రవారం సందర్భంగా ఈరోజు ఉదయం 6:30 గంటలకు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసులు శేషాచార్యులు చే అమ్మవారికి అభిషేకం.ఉదయం 8 గంటలకు భక్తులకు రాఖీలు, జంధ్యాలు పంపిణీ. మధిర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా నేడు వాసవి మాతకు చీరలతో ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్నినిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఉదయం 6:30 గంటలకు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసులు శేషాచార్యులు ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలునిర్వహించనున్నారు.అనంతరం ఉదయం 8 గంటలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా భక్తులకు రాఖీలు,జంధ్యాలు పంపిణీ చేయనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాసవి మాత కృపకు పాత్రులు కాగలరని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


