గ్రామాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తాం
- కో-ఆపరేటివ్ డైరెక్టర్ చక్కటి దేవేందర్ రెడ్డి
- సీసీ కెమెరాల ఏర్పాటు కోసం షాబాద్ సీఐకి రూ.లక్ష చెక్కు అందజేత
షాబాద్,(రంగారెడ్డి): గ్రామాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తామని షాబాద్ కో-ఆపరేటివ్ డైరెక్టర్ చక్కటి దేవేందర్ రెడ్డి అన్నారు. షాబాద్ మండలంలోని పెద్దవేడు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు.ఈ మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు షాబాద్ సీఐ లక్ష్మారెడ్డికి రూ.లక్ష విలువైన చెక్కును అందజేశారు. గ్రామంలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని దేవేందర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్ నాయక్, ప్రవీణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
