అర్హులైన వారు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి: మల్యాల ఎంపీడీవో
మల్యాల, మల్యాల మండల పరిధిలోని అర్హులైన వారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మల్యాల ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వం కొన్ని కేటగిరీలకు మాత్రమే ప్రస్తుతం అవకాశం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వారు: వితంతువులు,ఒంటరి మహిళలు దివ్యాంగులు (40% వైకల్యం ఉన్నవారు),50 ఏళ్లు నిండిన కల్లుగీత కార్మికులు,50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు,ఫైలేరియా బాధితులు,డయాలసిస్, బాధితులు, ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు మరియు బీడీ కార్మికుల పింఛన్ల దరఖాస్తులకు ఎలాంటి అవకాశం లేదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరు. అర్హత కలిగిన లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
