అర్హులైన వారు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి: మల్యాల ఎంపీడీవో

అర్హులైన వారు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి: మల్యాల ఎంపీడీవో

​మల్యాల,  మల్యాల మండల పరిధిలోని అర్హులైన వారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మల్యాల ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వం కొన్ని కేటగిరీలకు మాత్రమే ప్రస్తుతం అవకాశం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ​దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వారు: ​వితంతువులు,​ఒంటరి మహిళలు ​దివ్యాంగులు (40% వైకల్యం ఉన్నవారు),​50 ఏళ్లు నిండిన కల్లుగీత కార్మికులు,​50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు,​ఫైలేరియా బాధితులు,​డయాలసిస్, బాధితులు, ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు  మరియు బీడీ కార్మికుల పింఛన్ల దరఖాస్తులకు ఎలాంటి అవకాశం లేదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరు. ​అర్హత కలిగిన లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News