పోచమ్మ దేవతకు ఒడిబియ్యం సమర్పించిన లాల్ కృష్ణ ప్రసాద్ దంపతులు.
పరిగి , వికారాబాద్: పరిగి మండలం జాఫర్పల్లి గ్రామంలో పోచమ్మ బోనాల సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ ప్రసాద్, ఆయన సతీమణి పద్మ, కుమారుడు విఘ్నేష్ ఆధ్వర్యంలో పోచమ్మ దేవతకు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం సమర్పించారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. పోచమ్మ బోనాల వేడుకలు గ్రామంలో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయని, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేష్ కుమార్, ఉప సర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు భారతమ్మ, శ్రీనివాస్, సత్తయ్య, లలిత, పెంటయ్య, గ్రామ పెద్దలు కురువ రామచంద్రయ్య, వెంకటయ్య, గంగ శీను, జంగయ్య, శివకుమార్, రాకేష్, వి. నర్సింలు, రమేష్, శ్రీనివాస్, గంగ అంజయ్య, మల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
